Tirupati: వెటర్నరీ కళాశాల భవనంపైకెక్కి విద్యార్థుల నిరసన
ABN, First Publish Date - 2022-03-11T17:14:42+05:30
నగరంలో వెటర్రరీ కళాశాల విద్యార్థులు భవనం పైకి ఎక్కి ఆందోళన చేపట్టారు.
తిరుపతి: నగరంలో వెటర్రరీ కళాశాల విద్యార్థులు భవనం పైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. సమస్యలు పరిష్కరించకుంటే దూకేస్తామంటూ హెచ్చరించారు. ప్రభుత్వానికి, వెటర్నరీ విశ్వవిద్యాలయ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్టెఫండ్ను పెంచడంతో పాటు ఆర్.ఎల్.యు ఉన్నతీకరణ, వెటర్నరీ డయాగ్నోస్టిక్ లేబొరేటరీలో వైద్యులు, శాశ్వత ప్రాతిపదికన వెటర్నరీ డాక్టర్లను నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ నిరసనకు దిగారు.
Updated Date - 2022-03-11T17:14:42+05:30 IST