Tirumalaలో హనుమజ్జయంతి వేడుకలు
ABN, First Publish Date - 2022-05-26T02:28:00+05:30
తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆకాశగంగలో అంజనాదేవికి
తిరుమల: తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆకాశగంగలో అంజనాదేవికి, బాలాంజనేయస్వామికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు జరిపారు.టీటీడీ ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం జపాలికి చేరుకుని ఆంజనేయస్వామికి టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే తిరుమలలో శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి ఘాట్రోడ్డులోని ఏడవమైలు వద్దనున్న ప్రసన్న ఆంజనేయస్వామి విగ్రహానికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమజ్జయంతిని పురస్కరించుకుని బుధవారం తిరుమలలోని నాదనీరాజనం వేదికపై, ఆకాశగంగ, జపాలి తీర్థంలో నిర్వహించిన ధార్మికోపన్యాసాలు, భక్తిసంగీతం ఆకట్టుకున్నాయి.
Updated Date - 2022-05-26T02:28:00+05:30 IST