తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ABN, First Publish Date - 2022-07-02T13:51:31+05:30
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. శుక్రవారం తిరుమల శ్రీవారిని 64,628 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 41,613 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Updated Date - 2022-07-02T13:51:31+05:30 IST