Tirumala: టీటీడీకి ఎలక్ట్రిక్ స్కూటర్లు
ABN, First Publish Date - 2022-07-23T00:42:32+05:30
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి గురువారం 25 టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు (TVS Electric Scooters) కానుకగా అందాయి.
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి గురువారం 25 టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు (TVS Electric Scooters) కానుకగా అందాయి. దాదాపు రూ.30 లక్షల విలువైన ఈ ద్విచక్రవాహనాలకు శుక్రవారం ఉదయం ఆలయం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాహనాల తాళాలను టీటీడీ ఈవో ధర్మారెడ్డి (Dharma Reddy)కి అందజేశారు. తిరుమల పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే విధంగా ఎలక్ట్రిక్ వాహనాలను అందించిన టీవీఎస్ సంస్థకు ఈవో ధన్యవాదాలు తెలిపారు.
Updated Date - 2022-07-23T00:42:32+05:30 IST