ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నను రక్షించి.. అమరులయ్యారు!

ABN, First Publish Date - 2022-07-18T08:56:14+05:30

అన్నను రక్షించి.. అమరులయ్యారు!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరెంటు షాక్‌తో ఇద్దరు సోదరుల మృతి.. అనంతలో పెను విషాదం

కణేకల్లు, జూలై 17: అనంతపురం జిల్లా కణేకల్లు మండలం ఉడేగోళం గ్రామ సమీపాన పొలంలో ఆదివారం విద్యుదాఘాతంతో ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందగా..మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. గ్రామ మాజీ సర్పంచ్‌ యల్లప్ప కుమారులైన రమేష్‌ (33), దేవేంద్ర (26), వన్నూరుస్వామి తమ భూమిలో వ్యవసాయ విద్యుత్‌ మోటారు సాయంతో నీరు వదులుతూ వరి విత్తనాలు చల్లే పనిలో నిమగ్నమయ్యారు. అయితే మోటారు మొరాయించగా దానిని సరిచేసే ప్రయత్నంలో పెద్దవాడైన వన్నూరుస్వామికి షాక్‌ కొట్టింది. గమనించిన సోదరులు.. అన్నను కాపాడేందుకు అతన్ని పట్టుకున్నారు. ముగ్తురూ విద్యుత్‌ షాక్‌తో అపస్మారక స్థితిలో పడిపోయారు. కొద్దిసేపటికి తేరుకున్న వన్నూరుస్వామి గ్రామస్థులకు, బంధువులకు సమాచారం అందించాడు. వారు అక్కడికి చేరుకుని రమేష్‌, దేవేంద్రను కణేకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ ఇద్దరూ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.


Updated Date - 2022-07-18T08:56:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising