తప్పుచేసిన వారిని క్షమించే ప్రసక్తే లేదు: కారుమూరి
ABN, First Publish Date - 2022-08-11T08:36:10+05:30
తప్పుచేసిన వారిని క్షమించే ప్రసక్తే లేదు: కారుమూరి
తిరుమల, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): తప్పుచేసిన వారిని జగన్ ప్రభుత్వం క్షమించే ప్రసక్తే లేదని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. వేంకటేశ్వర స్వామి దర్శనార్థం గురువారం తిరుమలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వాస్తవమైతే మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో సందేహం లేదు. వైసీపీని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే మాధవ్పై ఆరోపణలు చేస్తున్నారు. ఆ వీడియోపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుంది. గోరంట్ల మాధవ్పై గతంలో ఉన్న అత్యాచారయత్నం కేసు కోర్టులో ఉంది, నిజమే అయితే చట్టం తనపని తాను చేస్తుంది’’ అని మంత్రి అన్నారు.
Updated Date - 2022-08-11T08:36:10+05:30 IST