ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంట గంటకూ పెరుగుతున్న Godavari వరద ఉధృతి

ABN, First Publish Date - 2022-07-11T17:22:34+05:30

భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. గంట గంటకూ వరద ఉధృతి పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: భారీ వర్షాల(Heavy rains) కారణంగా గోదావరి(Godavari) ఉగ్రరూపం దాల్చుతోంది. గంట గంటకూ వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ (Dhavaleshwaram Cotton Barrage) వద్ద నీటిమట్టం  8 అడుగులకు చేరింది. దీంతో అధికారులు బ్యారేజీ 175 గేట్లు ఎత్తివేత ఆరు లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు కోనసీమ లంక గ్రామాల్లోకి  వరద నీరు వచ్చి చేరింది. దీంతో పలు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నాటుపడవలపైనే రాకపోకలు  కొనసాగుతున్నాయి. అలాగే పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అటు విలీన మండలాల్లో శబరి, గోదావరి భారీ వర్షాలకు పొంగి ప్రవహిస్తోంది. చింతూరు మండలం సోకిలేరు వంతెనపై వరద నీరు ప్రవహిస్తుండటంతో చింతూరు - విఆర్ పురం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం వద్ద  గోదావరి నీటిమట్టం 38 అడుగులకు చేరుకుంది. వీఆర్‌పురం మండలం ములకపాడు గ్రామ సమీపంలోకి గోదావరి పోటెత్తింది. దీంతో గ్రామస్తులు కొండలపై తాత్కాలిక గుడిసెలు వేసుకుని తల దాచుకుంటున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ అధికారులు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని  గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-07-11T17:22:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising