ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కాన్వాయ్‌...క్రౌర్యం

ABN, First Publish Date - 2022-04-22T08:14:28+05:30

సీఎం కాన్వాయ్‌ కోసం ఏకంగా ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారునే అధికారులు లాగేసుకుని వారిని నడిరోడ్డుపై వదిలేశారు. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల భక్తుల కారు లాగేసుకున్నారు

అర్ధరాత్రి నడిరోడ్డుపై వారిని వదిలేశారు

ఒంగోలు బస్టాండ్‌లో రాత్రంతా అవస్థలు 


తిరుమల, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): సీఎం కాన్వాయ్‌ కోసం ఏకంగా ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారునే అధికారులు లాగేసుకుని వారిని నడిరోడ్డుపై వదిలేశారు. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన శ్రీనివాస్‌ శ్రీవారి దర్శనం కోసం తన భార్య పార్వతి, మరో జంట, ఇద్దరు పిల్లలతో ట్రావెల్స్‌లో కారు బుక్‌ చేసుకుని బయలుదేరారు. బుధవారం రాత్రి 7 గంటలకు వినుకొండలో బయలుదేరిన వీరు 10 గంటల సమయంలో ఒంగోలు సిటీ చేరుకున్నారు. అక్కడ ఓ డాబాలో టిఫిన్‌ చేశారు. అంతలో అసిస్టెంట్‌ ఎంవీఐ సంధ్య, హోంగార్డు అక్కడకు వచ్చి ‘మీ లగేజీ కారు నుంచి దించుకోండి. ఈ వెహికల్‌ సీఎం కాన్వాయ్‌ కోసం ఉంచుకుంటున్నాం’’ అని చెప్పి.. కారు తీసుకుని వెళ్లిపోయారు. తాము తిరుపతికి వెళుతున్నామని, ఇలా రోడ్డుపై వదిలేస్తే ఎలా సార్‌ అని బతిమలాడినా వినలేదు. ఆ సమయంలో మరో కారు లభించకపోవడంతో రోడ్డుపైనే చాలాసేపు శ్రీనివాస్‌ కుటుం బం ఉండిపోయింది. ఆ తర్వాత అర్ధరాత్రి వరకూ ఒంగోలు బస్టాండ్‌లో తలదాచుకుంది. ‘‘వినుకొండ నుంచి మరోకారును బుక్‌ చేసుకున్నప్పటికీ కారును ఒంగోలు సిటీలోకి రావొద్దని చెప్పాం. సిటీలోకి వస్తే మళ్లీ  అధికారులు ఆ కారును కూడా తీసుకుంటారేమోనని భయపడ్డాం. అందుకుని ఒంగోలు శివార్లకు వెళ్లి కారు ఎక్కాం’’ అని శ్రీనివాస్‌ వాపోయారు.

Updated Date - 2022-04-22T08:14:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising