ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లారీని ఢీకొన్న బస్సు

ABN, First Publish Date - 2022-02-20T02:43:53+05:30

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం సమీపంలో ఆగి ఉన్న లారీని టూరిస్ట్‌ బస్సు ఢీకొట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రణస్థలం: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం సమీపంలో ఆగి ఉన్న లారీని టూరిస్ట్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒడిశా రాష్ట్రానికి చెందిన 33 మంది వలస కూలీలకు గాయాలయ్యాయి. ఒడిశా రాష్ట్రం బరంపూర్‌ నుంచి 47 మంది వలసకూలీలతో ఈ బస్సు శుక్రవారం రాత్రి తమిళనాడు బయలుదేరింది. శనివారం ఉదయం 6 గంటల సమయంలో పైడిభీమవరం సమీపంలో వంతెన వద్ద ఆగి ఉన్న లారీని ఈ బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో బస్సు క్యాబిన్‌లో డ్రైవర్లు బిజు, అనూష్‌లు చిక్కుకున్నారు. వీరితోపాటు మరో 31 మంది గాయపడ్డారు. స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్స్‌లపై శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్‌-రిమ్స్‌)కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం డ్రైవర్‌ బిజు, అనూష్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

Updated Date - 2022-02-20T02:43:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising