విశాఖలో మరోసారి ఉద్రిక్తత
ABN, First Publish Date - 2022-01-05T21:24:31+05:30
రింగు వలల వివాదంతో నగరంలో మళ్లీ
విశాఖ: రింగు వలల వివాదంతో నగరంలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న తమవారిని విడిచిపెట్టాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. రోడ్డుపైకి వేల సంఖ్యలో గ్రామస్తులు వచ్చారు. రోడ్డుపై బైఠాయించారు. మంత్రులు, అధికారులతో చర్చలు బాయ్కాట్ చేస్తున్నామని మత్స్యకార నాయకులు తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిని విడిచిపెట్టే వరకు చర్చలకు వెళ్లేది లేదని మత్స్యకార నాయకులు స్పష్టం చేశారు.
Updated Date - 2022-01-05T21:24:31+05:30 IST