ఆర్థిక ఇబ్బందులతో కౌలు రైతు ఆత్మహత్య
ABN, First Publish Date - 2022-01-03T09:19:51+05:30
ఆర్థిక ఇబ్బందులతో కౌలు రైతు ఆత్మహత్య
పెడన, జనవరి 2: ఆర్ధిక ఇబ్బందులు తాళలేక కౌలురైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కృష్ణాజిల్లా పెడన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని పుల్లపాడు శివారు దేవరపల్లి గ్రామానికి చెందిన పాము నందయ్య (53) నాలుగెకరాల పొలం కౌలు తీసుకుని సాగు చేస్తున్నాడు. సుమారు రూ.6 లక్షల వరకు అప్పులు చేశాడు. అవి తీర్చే దారిలేక మనస్తాపానికి గురై శనివారం రాత్రి పురుగుమందు తాగాడు. కుటుంబసభ్యులు మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆదివారం మృతి చెందాడు. నందయ్యకు భార్య, పెళ్లి ఈడుకు వచ్చిన ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.
Updated Date - 2022-01-03T09:19:51+05:30 IST