ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sahitya Akademi Awards: ఈ ఏడాది కేంద్ర సాహిత్య బాల... యువ సాహిత్య పురస్కార గ్రహీతలు వీరే...

ABN, First Publish Date - 2022-08-25T02:22:00+05:30

కేంద్ర సాహిత్య అకాడమీ 2022 సంవత్సరానికి గాను యువ, బాల పురస్కారాలను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 22 మంది రచయితలను బాలసాహిత్య పురస్కారాలకు ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ 2022 సంవత్సరానికి గాను యువ, బాల పురస్కారాలను బుధవారం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 22 మంది రచయితలు బాలసాహిత్య పురస్కారాలకు ఎంపికయ్యారు. తెలంగాణ (Telangana) రాష్ట్రం సిరిసిల్లకు చెందిన పత్తిపాక మోహన్‌ను కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారానికి ఎంపికవగా.. ఏపీలోని చిత్తూరు జిల్లా (Chittoor District) సత్యవేడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన పల్లిపట్టు నాగరాజును కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వరించింది.


బాల సాహిత్య పురస్కారానికి న్యాయ నిర్ణేతలుగా బెలగం భీమేశ్వరరావు, డాక్టర్ ఎన్. గోపి, చొక్కాపు వెంకటరమణ వ్యవహరించారు. కేంద్ర సాహిత్య యువ పురస్కారానికి ప్రొఫెసర్ హనుమాండ్ల భూమయ్య, ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపారాణి, డాక్టర్ పెన్నా శివరామ కృష్ణ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.


పత్తిపాక మోహన్‌

కవి, సాహిత్య విమర్శకులు అయిన పత్తిపాక మోహన్‌  నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలోని చేనేత కుటుంబంలో జన్మించిన పత్తిపాక మోహన్ బాలల కోసం అనేక రచనలు చేశారు. పురస్కారానికి ఎంపికైన ‘బాలల తాత బాపూజీ’ తో పాటు.. ‘పిల్లల కోసం మన కవులు’, ‘జో.. అచ్యుతానంద జోజో ముకుంద’, ‘ఒక్కేసి.. పువ్వేసి’, ‘చందమామ.. చందమామ రావే’ వంటి అనేక రచనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లోని కథలను మోహన్‌ తెలుగులోకి అనువదించారు.  


పల్లిపట్టు నాగరాజు

చిత్తూరు జిల్లా యాసలో కష్టజీవులు, బడుగుల బతుకులపై ‘యాలై పూడ్సింది’ శీర్షికతో పల్లిపట్టు నాగరాజు రచించిన కవితా సంపుటి కేంద్ర సాహిత్య యువ పురస్కారానికి ఎంపికైంది. నాగరాజు తెలుగు భాష ఉపాధ్యాయుడు. ఆయన ఈ కవితా సంపుటితో  ‘ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు’ను కూడా అందుకున్నారు. 


కేంద్ర సాహిత్య యువ పురస్కారాలను 35 ఏళ్ల లోపు వయసున్న సాహితీవేత్తలకు ప్రకటిస్తారు. 2011 నుంచి అందిస్తున్న ఈ పురస్కారం కింద 50 వేల రూపాయల నగదుతో పాటు జ్ఞాపికలను బహుకరిస్తారు. తెలుగు భాషతో పాటు అస్సామీ, బెంగాలీ, బోడో, దోగ్రి, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, కశ్మీరీ, కొంకణి, మైథిలీ, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒడియా, రాజస్థానీ, సంస్కృతం, సింధి, తమిళం, ఉర్దూ భాషల్లో ఉత్తమ రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ ఏటా పురస్కారాలు అందిస్తోంది.

Updated Date - 2022-08-25T02:22:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising