నిరాధారమైన ఆరోపణలపై సభలో చర్చించాలని కోరడం విడ్డూరం: టీడీపీ
ABN, First Publish Date - 2022-03-21T17:01:24+05:30
అమరావతి: స్పీకర్ తమ్మినేని సీతారామ్కు టీడీపీ శాసనసభ పక్షం లేఖ రాసింది.
అమరావతి: స్పీకర్ తమ్మినేని సీతారామ్కు టీడీపీ నేతలు లేఖ రాశారు. నిరాధార ఆరోపణలు చేసి సభలో చర్చ పెట్టాలని కోరడాన్ని తప్పుపడుతూ లేఖ రాశారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన పెగసెస్ సాఫ్ట్ వేర్పై చర్చ పెట్టాలని కోరారు. దీనిపై టీడీపీ నేతలు స్పందించారు. గతంలో దీనికి సంబంధించి డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ను అడిగితే ఆ సాఫ్ట్వేర్ కొనలేదని రాతపూర్వకంగా ఇచ్చారని, ఎంపీ విజయసాయిరెడ్డి దీనిపై చర్చ అవసరం లేదని రాజ్యసభలో అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం నిరాధారమైన ఆరోపణలపై సభలో చర్చించాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. ఇటువంటి చర్యలు నిరోధించి సభ గౌరవం కాపాడాలని టీడీపీ నేతలు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2022-03-21T17:01:24+05:30 IST