TDP women leaders: సంపూర్ణ మద్య నిషేధంపై టీడీపీ మహిళా నేతల పోరుబాట
ABN, First Publish Date - 2022-07-30T17:23:32+05:30
సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని టీడీపీ మహిళా నేతలు పోరుబాట పట్టారు.
తిరుపతి: సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని టీడీపీ మహిళా నేతలు (TDP Women leaders) పోరుబాట పట్టారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలంటూ.. తిరుపతి నగరంలోని గాంధీ విగ్రహం ఎదుట తాళిబొట్టు, ఉరితాళ్లతో తెలుగు మహిళలు విన్నూత్న రీతిలో నిరసన చేపట్టారు. మద్యపానాన్ని నిషేధించడంలో సీఎం జగన్ మాట తప్పారని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ (Sugunamma) ఆరోపించారు. మద్యపానాన్ని ఎత్తి వేయకపోతే మహిళలకు ఉరితాడు తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని తిరుపతి మహిళలు హెచ్చరించారు.
Updated Date - 2022-07-30T17:23:32+05:30 IST