జీవో 217 రద్దు చేసేవరకూ టీడీపీ పోరాడుతుంది: కొల్లు రవీంద్ర
ABN, First Publish Date - 2022-03-17T21:49:55+05:30
జీవో 217 రద్దు చేసేవరకూ టీడీపీ పోరాడుతుందని ఆ పార్టీ నేత కొల్లు రవీంద్ర ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
అమరావతి: జీవో 217 రద్దు చేసేవరకూ టీడీపీ పోరాడుతుందని ఆ పార్టీ నేత కొల్లు రవీంద్ర ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీవో 217తో మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. చెరువులపై ఆధారపడి లక్షలాది మత్స్యకారులు బతుకుతున్నారని తెలిపారు. చెరువులు మత్స్యకారులకు చెందకూడదనే.. ప్రభుత్వం ఆన్లైన్ టెండర్ విధానం తీసుకొచ్చిందని తప్పుబట్టారు. మత్స్యకారులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కొల్లు రవీంద్ర దుయ్యబట్టారు.
Updated Date - 2022-03-17T21:49:55+05:30 IST