మహిళలపై నేరాలకు ప్రభుత్వ వైఫల్యమే కారణం: టీడీపీ
ABN, First Publish Date - 2022-04-25T21:18:10+05:30
టీడీపీ స్ట్రాటజీ కమిటీ సోమవారం సమావేశం అయింది. ఈ సమావేశంలో తెలుగుదేశం నేతలకు కీలక అంశాలపై సూచనలు చేశారు.
అమరావతి: టీడీపీ స్ట్రాటజీ కమిటీ సోమవారం సమావేశం అయింది. ఈ సమావేశంలో తెలుగుదేశం నేతలకు కీలక అంశాలపై సూచనలు చేశారు. ‘‘జగన్ అసమర్థ పాలనతో యువత భవిష్యత్ కాలరాశాడు.న్యాయం కోసం రోడ్డెక్కితే అణిచివేత లక్ష్యంగా పెట్టుకున్నారు.మహిళలపై నేరాలకు ప్రభుత్వ వైఫల్యమే కారణం చేతగాని తనంతోనే పోలవరాన్ని బలి చేశారు. గ్రామాల్లో రెండు గ్లాసుల సిద్ధాంతాన్ని రూపు మాపింది టీడీపీనే. జగన్ పాలనపై యువత తీవ్ర అవేదన, అసంతృప్తితో ఉన్నారు.800 మందిపై అత్యాచారాలు జరిగినా ఒక్కరికీ న్యాయ చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులపై జగన్ రెడ్డి ప్రతీకారం దుర్మార్గం.మిగులు విద్యుత్ రాష్ట్రంలో విద్యుత్ కోతలు జగన్ చేతకాని తనమే.నెల్లూరు కోర్టులో చోరీతో నేరస్తులకు కొత్త మార్గం రూపొందించారు. అనుబంధ కమిటీల్లో యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తాం’’ అని టీడీపీ స్ట్రాటజీ కమిటీ పేర్కొంది.
Updated Date - 2022-04-25T21:18:10+05:30 IST