ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులను మోసం చేసింది: ఎమ్మెల్సీ అశోక్ బాబు

ABN, First Publish Date - 2022-01-20T22:27:52+05:30

పీఆర్సీ విషయంలో కల్లబొల్లి కబుర్లు, మోసపూరిత వాగ్దానాలతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పీఆర్సీ విషయంలో కల్లబొల్లి కబుర్లు, మోసపూరిత వాగ్దానాలతో ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ధ్వజమెత్తారు. ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడానికి శంఖారావం పూరించాయని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలు ఐక్యమైతే 14 లక్షల మంది ఉద్యోగస్థుల దశ దిశ మార్చగలరని ఆయన అన్నారు. ఫిబ్రవరి 7 నుంచి సమ్మె చేస్తామని నోటీసులిచ్చే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. రెండుచేతులతో ఓట్లేసిన ఉద్యోగస్థుల పట్ల ప్రభుత్వం ఉదారత చూపాలని ఆయన కోరారు. జీతాలు పెరుగుతాయి, తగ్గవు అని ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెబుతోందన్నారు. జనవరి జీతాలు కొత్త పీఆర్సీ ప్రకారం ఇస్తామనే మొండి వైఖరి మానాలని ఆయన హితవు పలికారు. ఉపాధాయులందరూ రోడ్లపైకి వస్తే సేవలందించేవారెవరని ఆయన ప్రశ్నించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీతాలు తగ్గించిన చరిత్ర జగన్‌ది అని ఆయన మండిపడ్డారు.

Updated Date - 2022-01-20T22:27:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising