Andhra news: పెద్ద ఆవుటుపల్లి వద్ద టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
ABN, First Publish Date - 2022-07-21T18:02:04+05:30
కృష్ణా జిల్లా తెంపల్లికి వస్తున్న టీడీపీ నేతలను పెద్ద ఆవుటుపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
అమరావతి: కృష్ణా జిల్లా తెంపల్లికి వస్తున్న టీడీపీ నేతల(TDP leaders)ను పెద్ద ఆవుటుపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలోకి ప్రవేశం లేదంటూ పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పోలీసులతో టీడీపీ నేత బుద్ధా వెంకన్న(budda venkanna) వాగ్వాదానికి దిగారు. వైసీపీ నాయకులు మాత్రం వందల సంఖ్యలో తిరగవచ్చు కానీ...తాము మాత్రం వెళ్ళకూడదు అని ఆకాంక్షలు ఏమిటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలను మాత్రమే తెంపల్లి గ్రామంలోనికి పంపి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
మరోవైపు తెంపల్లి గ్రామం పోలీసుల గుప్పెట్లోకి వెళ్లింది. తెలుగుదేశం నాయకులు తెంపల్లి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పోలీస్ పహారా కాస్తున్నారు. కంకిపాడు, పెనమనూరు, హనుమాన్ జంక్షన్, గన్నవరం స్టేషన్ నుంచి భారీగా పోలీసులు తెంపల్లికి చేరుకున్నారు. తెంపల్లి గ్రామంలోనికి ప్రవేశం లేకుండా చుట్టూ పోలీసుల వలయం ఏర్పాటు చేశారు. బారికేడ్లు పెట్టి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. పెద్ద ఆవుటుపల్లి వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించారు. దీంతో తెంపల్లి గ్రామంలో హైటెన్షన్ నెలకొంది.
Updated Date - 2022-07-21T18:02:04+05:30 IST