ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారంలోకి రాగానే.. ఆదీవాసీ సంక్షేమ జీవో అమలు..

ABN, First Publish Date - 2022-08-09T21:43:10+05:30

టీడీపీ అధికారంలోకి రాగానే ఆదివాసీల సంక్షేమానికి సంబంధించిన జీవో నం.3ను అమలు చేస్తామని ఆ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు తెలిపారు. జిల్లా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: టీడీపీ అధికారంలోకి రాగానే  ఆదివాసీ సంక్షేమ జీవోను అమలు చేస్తామని ఆ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు తెలిపారు. జిల్లా పరిధిలోని కుక్కునూరు మండలంలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో.. నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ ఆదివాసీలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.


ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. శ్రీనివాసులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీలంతా కలిసికట్టుగా ముందుకు వెళ్దామని, అందరూ ఒకే తాటిపై ఉండాలని పిలుపినిచ్చారు. గిరిజనుల సంక్షేమానికి  టీడీపీ కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ కుక్కునూరు మండల అధ్యక్షుడు ములిశెట్టి నాగేశ్వరరావు, గిరిజన నాయకులు కుంజా భద్రం, మడకం నాగేశ్వరావు, కుంజా రమేష్, కట్టం రాంబాబు, నూపా శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.





Updated Date - 2022-08-09T21:43:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising