వైసీపీ నేతల అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి: Varla
ABN, First Publish Date - 2022-07-21T19:53:42+05:30
రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla ramaiah) విమర్శించారు.
అమరావతి: రాష్ట్రంలో వైసీపీ(YCP) నేతల అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla ramaiah) విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... దొంగలంతా కలిసి ఊళ్లు పంచుకున్నట్లు వైసీపీ నేతలు క్వారీలను లాక్కుని వాటాలు పంచుకుంటున్నారని ఆరోపించారు. కర్ణాటకకు చెందిన జనార్ధన్నాయుడి క్వారీ, క్రషర్ను వైసీపీ ఎమ్మెల్యే వెంకటగౌడ 2020లో దౌర్జన్యంగా లాక్కున్నారన్నారు. ఎమ్మెల్యే అయింది ప్రజాసమస్యలు పరిష్కరించడానికా?, దోచుకోవడానికా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారన్నారు. ఎమ్మెల్యే వెంకటగౌడపై చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
Updated Date - 2022-07-21T19:53:42+05:30 IST