జిల్లాల విభజన అనాలోచిత నిర్ణయం: సోమిరెడ్డి
ABN, First Publish Date - 2022-02-17T22:36:18+05:30
ఏపీలో పార్లమెంట్ పరిధిని ఆధారంగా చేసుకుని జిల్లాలను విభజించడం అనాలోచిత
అమరావతి: ఏపీలో పార్లమెంట్ పరిధిని ఆధారంగా చేసుకుని జిల్లాలను విభజించడం అనాలోచిత నిర్ణయమని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. మీడియాతో ఆయన ఇక్కడ మాట్లాడారు. పార్లమెంట్ పరిధికి జిల్లా ఏర్పాటుకు సంబంధం లేదన్నారు. 2026లో దేశ వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల పునర్విభజనతో సరిహద్దులు మారతాయని ఆయన పేర్కొన్నారు. అప్పుడు మళ్లీ జిల్లాలను మారుస్తారా అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ సరిహద్దులను పక్కనపెట్టి జిల్లాల విభజన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Updated Date - 2022-02-17T22:36:18+05:30 IST