Lokesh comments: అన్నం తినే వారెవ్వరూ అన్న క్యాంటీన్ను అడ్డుకోరు
ABN, First Publish Date - 2022-09-03T19:13:12+05:30
అన్నం తినే వారెవ్వరూ అన్న క్యాంటీన్ను అడ్డుకోరని... జగన్ రెడ్డి (Jagan reddy) తింటుంది ఏంటో ఆయనే తేల్చుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (Nara lokesh) వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: అన్నం తినే వారెవ్వరూ అన్న క్యాంటీన్ను అడ్డుకోరని... జగన్ రెడ్డి (Jagan reddy) తింటుంది ఏంటో ఆయనే తేల్చుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (Nara lokesh) వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... నందిగామ, మంగళగిరి, కుప్పంలో అడ్డుపడ్డారని... ఇప్పుడు తెనాలిలో అన్న క్యాంటీన్ నిర్వహించకుండా ఆపుతున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి (AP CM)లో మానవత్వం అనేదే లేదా? అని ప్రశ్నించారు. తెనాలిలో అన్న క్యాంటీన్ (Anna canteen)కు అడ్డుపడటం మార్కెట్ కాంప్లెక్స్ వద్ద యుద్ద వాతావరణాన్ని తలపించే విధంగా పోలీస్ పహారా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్న క్యాంటీన్ నిర్వహించి తీరుతామని... పేద వాళ్ళ ఆకలి తీరుస్తామని లోకేష్ స్పష్టం చేశారు.
Updated Date - 2022-09-03T19:13:12+05:30 IST