యడ్లపాటి వెంకట్రావు మృతి విచారకరం: Lokesh
ABN, First Publish Date - 2022-02-28T16:04:56+05:30
రాజకీయ యోధుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు మృతి విచారకరమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
అమరావతి: రాజకీయ యోధుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు మృతి విచారకరమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, జెడ్పీ చైర్మన్గా, రాజ్యసభ సభ్యునిగా చేపట్టిన పదవులకే వన్నె తెచ్చారని తెలిపారు. నిజాయితీకి నిలువెత్తు సంతకం, స్వచ్ఛమైన రాజకీయాలకు దశాబ్దాల సాక్ష్యంగా నిలిచిన పెద్దాయన యడ్లపాటి వెంకటరావు అని అన్నారు. యడ్లపాటి కుటుంబ సభ్యులకు లోకేష్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
Updated Date - 2022-02-28T16:04:56+05:30 IST