Lokesh comments: పోలీస్స్టేషన్ నాకు అత్తారిల్లు అయింది
ABN, First Publish Date - 2022-09-08T20:33:21+05:30
వైసీపీ ప్రభుత్వం అన్నం పెట్టదు.. పెట్టేవాళ్లను కొడుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విరుచుకుపడ్డారు.
అమరావతి: వైసీపీ ప్రభుత్వం (YCP government) అన్నం పెట్టదు.. పెట్టేవాళ్లను కొడుతుందని టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (Lokesh) విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... అన్నా క్యాంటీన్ల (Anna canteen) ఏర్పాటును అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం (AP Government) ఎందుకు ఇంతగా భయపడుతోందని... దాతల సహకారంతో క్యాంటీన్లను నడిపితే వారికేంటి అని ప్రశ్నించారు. టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. సంగం డెయిరీ రైతులకు మేలు చేస్తుంటే అడ్డుకునే కుట్రలో ఉన్నారన్నారు. ‘‘నాపై 15 కేసులు పెట్టారు, 7 సార్లు పీఎస్కు తీసుకెళ్లారు. పోలీస్స్టేషన్ నాకు అత్తగారిల్లు అయింది’’ అంటూ లోకేష్ వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2022-09-08T20:33:21+05:30 IST