పెట్టుబడుల కోసం జగన్ దావోస్ వెళ్లినట్లు లేదు..: Lokesh
ABN, First Publish Date - 2022-05-23T19:12:22+05:30
సీఎం జగన్ దావోస్ పర్యటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పలు వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: సీఎం జగన్ దావోస్ పర్యటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పలు వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... పెట్టుబడుల కోసం జగన్ దావోస్ వెళ్లినట్లు లేదని.. అక్కడ వైసీపీ నేతల మీటింగ్ జరుగుతున్నట్లే ఉందని విమర్శించారు. పారిశ్రామిక వేత్తలు ఎవరూ జగన్ను కలవడానికి రావడం లేదన్నారు. గత 24 గంటల్లో జగన్ను కలిసిన ఏకైక పారిశ్రామిక వేత్త ఆదానీ అని చెప్పుకొచ్చారు. ఏపీ రాజధాని ఏదంటే.. జగన్ ఏం సమాధానం చెబుతారని లోకేష్ ప్రశ్నించారు.
Updated Date - 2022-05-23T19:12:22+05:30 IST