జ్యోతిరావు పూలేకు ఘన నివాళులు: Lokesh
ABN, First Publish Date - 2022-04-11T13:54:08+05:30
మహాత్మా జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నివాళులర్పించారు.
అమరావతి: మహాత్మా జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నివాళులర్పించారు. ‘‘కుల వ్యవస్థను కూకటివేళ్లతో పెకళించాలనే ఉద్యమానికి ఆద్యుడు, సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబాపూలే. దేశంలో మొదటిసారిగా దళితులకు, బాలికలకు, స్త్రీలకు పాఠశాలలు ప్రారంభించిన ఆశాజ్యోతి. విద్యతోనే జ్ఞానం అభివృద్ధి సాధ్యమని నమ్మి ఆచరణలో పెట్టిన మహనీయులు జ్యోతిబా. దురాచారాలకు వ్యతిరేకంగానూ, వివిధ వర్గాల సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన ఉద్యమాలు నేటి తరాలకు ఆదర్శం. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను’’ అని లోకేష్ తెలిపారు.
Updated Date - 2022-04-11T13:54:08+05:30 IST