ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jawahar: జగన్‌కు మద్యంపై వచ్చే ఆదాయం తప్ప ప్రజల ఆరోగ్యం పట్టదు

ABN, First Publish Date - 2022-10-02T16:44:59+05:30

ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి మద్యంపై వచ్చే అక్రమ ఆదాయం తప్ప ప్రజల ఆరోగ్యం పట్టదని మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి Jagan mohan reddy)కి మద్యంపై వచ్చే అక్రమ ఆదాయం తప్ప ప్రజల ఆరోగ్యం పట్టదని మాజీ మంత్రి జవహర్ (Jawahar) మండిపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి (AP CM) ప్రభుత్వం అమ్ముతున్న నకిలీ మద్యం వల్ల మహిళల మాంగళ్యాలు రాలుతున్నా.. జగన్‌ (YCP Chief)కు చీమ కుట్టినట్టు లేదన్నారు. డిల్లీ అయిన గల్లీ అయిన మద్య కుంభకోణంలో జగన్ కుటుంబమే అని విమర్శించారు. నకిలీ మద్యానికి ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) అడ్డాగా మారిందని అన్నారు. రాష్ట్రంలో టీ దుకాణాలకన్నా వాకిన్ స్టోర్స్ ఎక్కువగా ఉన్నాయన్నారు. మద్యం వ్యాపారం జగన్(YS Jagan mohan reddy) కనుసన్నలలో జరుగుతోందని ఆరోపించారు. ప్రజలను మత్తులో పెట్టి పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. మద్యపాన నిషేధం హామీ మర్చిపోండని జగన్ రెడ్డి చెప్పకనే చెబుతున్నారని జవహర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

Updated Date - 2022-10-02T16:44:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising