పీఆర్సీ బిక్ష కాదనే విషయం జగన్ తెలుసుకోవాలి: Jawahar
ABN, First Publish Date - 2022-01-20T17:51:37+05:30
పీఆర్సీ బిక్ష కాదనే విషయం జగన్ తెలుసుకోవాలని మాజీ మంత్రి, టీడీపీ నేత జవహర్ అన్నారు.
అమరావతి: పీఆర్సీ బిక్ష కాదనే విషయం జగన్ తెలుసుకోవాలని మాజీ మంత్రి, టీడీపీ నేత జవహర్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ జగన్ మోసకారి మాటలను ఉద్యోగులు ఎప్పుడో గుర్తించారని తెలిపారు. సంఘ నాయకులే మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. చరిత్రలో ఇంత చెత్త పీఆర్సీనిచ్చి జగన్ చరిత్రలో నిలిచారని యెద్దేవా చేశారు. జగన్ నమ్మడం ఉద్యోగులకు శాపమైందని పేర్కొన్నారు. జగన్ పాలనలో ఉద్యోగులకు ఒరింగింది ఏమి లేదన్నారు. ఇప్పటికైనా జగన్ ప్రాపకం కోసం కాకుండా తమ వారి కోసం నాయకులు పని చేయాలని జవహర్ హితవుపలికారు.
Updated Date - 2022-01-20T17:51:37+05:30 IST