Devineni uma: పోలవరం నిర్వాసితులను గోదావరిలో ముంచేశారు
ABN, First Publish Date - 2022-09-19T17:40:49+05:30
కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్వాసితులను గోదావరిలో ముంచేశారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ మండిపడ్డారు.
అమరావతి: కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్వాసితులను గోదావరిలో ముంచేశారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ (Devineni uma) మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఎన్నికల ముందు ఎకరానికి రూ.10 లక్షలు ఇస్తామని చెప్పి... 40 నెలలుగా ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ఎంతమందికి పునరావాసం కల్పించారు? ఎంత ఖర్చుపెట్టారని నిలదీశారు. ఏ ప్రయోజనాల కోసం 31 మంది ఎంపీలను తాకట్టు పెట్టారని అడిగారు. పోలవరం ద్రోహిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని దేవినేని ఉమ (TDP Leader) ట్వీట్ చేశారు.
Updated Date - 2022-09-19T17:40:49+05:30 IST