Vijayawada: జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ వద్ద దేవినేని నిరసన
ABN, First Publish Date - 2022-05-19T17:16:18+05:30
జక్కంపూడి కాలనీలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(జేఎన్ఎన్యూఆర్ఎం) వద్ద స్థానిక ప్రజలతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బైఠాయించి ఆందోళనకు దిగారు.
విజయవాడ: జక్కంపూడి కాలనీలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(జేఎన్ఎన్యూఆర్ఎం) వద్ద స్థానిక ప్రజలతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బైఠాయించి ఆందోళనకు దిగారు. కాలనీలో డాక్టర్లు లేక మందులు లేక వేల మంది ప్రజలు అల్లాడుతున్నారని... నెలల తరబడి రాని డాక్టర్ రావాలంటూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నిరసన చేపట్టారు. అసాంఘిక కార్యక్రమాలకు నెలవైన గంజాయి బ్యాచ్ను అరికట్టేందుకు పోలీసులు రావాలంటూ నినాదాలు చేశారు.
Updated Date - 2022-05-19T17:16:18+05:30 IST