Andhra news: పేదల సంక్షేమం అంటే.. పేద విద్యార్థులను విద్యకు దూరం చేయడమేనా?: దేవతోటి
ABN, First Publish Date - 2022-07-19T15:34:51+05:30
జగన్ రెడ్డి ప్రభుత్వం స్కూల్స్ విలీనం పేరుతో పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్రను పన్నుతోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు విమర్శించారు.
అమరావతి: జగన్ రెడ్డి(Jagan reddy) ప్రభుత్వం స్కూల్స్ విలీనం పేరుతో పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్రను పన్నుతోందని టీడీపీ(TDP) రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు(Devathoti nagaraju) విమర్శించారు. పేదల సంక్షేమం అంటే.. పేద విద్యార్థులను విద్యకు దూరం చేయడమేనా అని ప్రశ్నించారు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం తుగ్లక్ పరిపాలనను ఆదర్శంగా తీసుకుంటున్నట్టుగా ఉందన్నారు. పాఠశాలల విలీనం నిర్ణయాన్ని సొంత పార్టీలోని 60 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారన్నారు. జగన్ రెడ్డి తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని సూచించారు. "విద్య ప్రాథమిక హక్కు" అనే విషయాన్ని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు... జగన్ రెడ్డికి చెప్పాలని దేవతోటి నాగరాజు అన్నారు.
Updated Date - 2022-07-19T15:34:51+05:30 IST