కుప్పంలో రెండోరోజు Chandrababu పర్యటన
ABN, First Publish Date - 2022-01-07T15:08:09+05:30
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటించనున్నారు.
చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటించనున్నారు. ఉదయం అతిథి గృహం వద్ద ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తారు. అనంతరం కుప్పం ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించనున్నారు. 11 గంటలకు కుప్పం మండలం దాసిగానూరు ట్యాంక్ను పరిశీలించి.. అనంతరం దాసిగానూరులోని గంగమ్మ దేవాలయంలో టీడీపీ అధినేత పూజలు నిర్వహించనున్నారు. కుప్పం మండలంలోని గుట్టపల్లి క్రాస్, కొత్త ఇండ్లు, నూలకుంటా, ఎన్.కొత్తపల్లి, గేరీగచేనుపల్లి, మిట్టపల్లి, వేపురా గ్రామాల్లో రోడ్ షోలు నిర్వహిస్తారు. రాత్రికి కుప్పం అతిథి గృహంలో బస చేయనున్నారు. చంద్రబాబును కలిసి వినతిపత్రాలు ఇచ్చేందుకు ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్ వద్దకు భారీ సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు.
Updated Date - 2022-01-07T15:08:09+05:30 IST