Chandrababu naidu: స్కూలు పిల్లల వరకు గంజాయి వచ్చేసిందంటే...
ABN, First Publish Date - 2022-10-03T17:36:40+05:30
13 ఏళ్ల పిల్లల చేతికి గంజాయి ఘటన ఆందోళన కలిగించిందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
అమరావతి: 13 ఏళ్ల పిల్లల చేతికి గంజాయి ఘటన ఆందోళన కలిగించిందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) అన్నారు. ఈమేరకు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... 13 ఏళ్ల వయసున్న బాలికలు విజయవాడలో గంజాయి తాగడం నివ్వెరపరిచిందన్నారు. ‘‘ఈ వార్త నన్ను ఎంతో ఆందోళనకు, ఆవేదనకు గురి చేసింది. స్కూలు పిల్లల వరకు గంజాయి వచ్చేసిందంటే... పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం అవుతుంది. తీవ్రమైన ఈ అంశంపై ప్రభుత్వ వ్యవస్థలు అత్యంత సీరియస్గా దృష్టిపెట్టాలి. సమూలంగా గంజాయిని అరికట్టేలా సత్వర చర్యలు తీసుకోవాలిరాజకీయ వేధింపులకు పోలీసులను వాడడంలో మునిగిపోయిన ప్రభుత్వం...యువత, విద్యార్థుల జీవితాలను గాలికి వదిలెయ్యడం క్షమించరాని నేరం. కొత్త సమస్యలు, సవాళ్ల నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది’’ అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
Updated Date - 2022-10-03T17:36:40+05:30 IST