Anagani satyaprasad: ఈ ప్రభుత్వం వల్ల ఎవరికి ఉపయోగం?
ABN, First Publish Date - 2022-09-28T18:31:53+05:30
రాష్ట్రంలో విష జ్వరాల విజృంభణపై సీఎం జగన్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బహిరంగ లేఖ రాశారు.
అమరావతి: రాష్ట్రంలో విష జ్వరాల విజృంభణపై సీఎం జగన్ రెడ్డి (CM Jagan)కి టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ (Anagani satyaprasad) బహిరంగ లేఖ రాశారు. విష జ్వరాలకు అమాయకులు బలవుతుంటే ప్రభుత్వం చోద్యం చూడటం దారుణమని మండిపడ్డారు. నాడు చంద్రబాబు (Candrababu) దోమలపై దండయాత్రంటే ఎగతాళి చేశారని... నేడు దోమలు ప్రజలపై దండయాత్ర చేస్తుంటే చేతులెత్తేశారని అన్నారు. జ్వర పీడితులకు కనీస వైద్యం అందించని ప్రభుత్వం (Ap government) వల్ల ఎవరికి ఉపయోగం అని ప్రశ్నించారు. నాడు నేడు కింద వేల కోట్లు కేటాయించామన్న పాలకుల మాటలు పచ్చి అబద్ధమన్నారు. ఆర్థిక సంఘం నిధులనూ ప్రభుత్వం దారి మళ్లించడంతో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు శూన్యమని విమర్శించారు. గుంతల రోడ్లపై నీరు నిల్వ ఉండటంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో జ్వరం బిళ్లలూ కరువే అని అన్నారు. ఆరోగ్యశ్రీ కింద అంటవ్యాధులకు ఉచిత వైద్యం అందడం లేదని, రాష్ట్రంలో ఎక్కడా దోమతెరల పంపిణీ కనిపించడం లేదంటూ అనగాని సత్యప్రసాద్ (TDP MLA) లేఖలో పేర్కొన్నారు.
Updated Date - 2022-09-28T18:31:53+05:30 IST