ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీని మద్యం మత్తులో ముంచాలని జగన్ పధకం: Alapatii raja

ABN, First Publish Date - 2022-06-22T18:01:44+05:30

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి(Jagan reddy) మోసపూరిత పాలన చేస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజా(Alapati raja) విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి(Jagan reddy) మోసపూరిత పాలన చేస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజా(Alapati raja) విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు చెప్పిన మాటలకు అధికారంలో చేసే పనులకు పొంతన లేదన్నారు. మద్యం నిషేధంపై జగన్ రెడ్డి గొప్ప గొప్ప మాటలు చెప్పారని... మద్యపాన నిషేధం అంశం ఏమైందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీచర్‌లతో మద్యం అమ్మించిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. 24/7 మద్యం ఏపీలో అన్ని చోట్ల అందుబాటులో ఉంటుందని అన్నారు. మద్యంతో పాటు గంజాయి కూడా విచ్చలవిడిగా అమ్ముతున్నారని మండిపడ్డారు. నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. మద్యం ద్వారా మగాళ్లను దోచుకుని మహిళలకు సంక్షేమ పధకాలు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. మద్యంపై అప్పులు తేవడం సిగ్గు చేటన్నారు. రాష్టాన్ని మద్యం మత్తులో ముంచాలని జగన్ పధకం చేస్తున్నారని ఆరోపించారు. ఆదాయంపై ప్రభుత్వం దొంగ లెక్కలు చూపుతోందని ఆలపాటి రాజా అన్నారు. 

Updated Date - 2022-06-22T18:01:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising