టీడీపీకి 160 సీట్లు వస్తాయి: అచ్చెన్నాయుడు
ABN, First Publish Date - 2022-04-11T22:48:42+05:30
బీసీ నాయకులను తయారుచేసే కర్మాగారం టీడీపీ అని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
అమరావతి: బీసీ నాయకులను తయారుచేసే కర్మాగారం టీడీపీ అని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడేళ్లలో బలహీనవర్గాలకు ఏం చేశారో సీఎం జగన్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు ఎవరేం చేశారన్నదానిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని జగన్కు సవాల్ విసిరారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీకి 160 సీట్లు వస్తాయని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.
Updated Date - 2022-04-11T22:48:42+05:30 IST