రుయా ఆస్పత్రి ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆవేదన
ABN, First Publish Date - 2022-04-26T19:38:57+05:30
రుయా ఆసుపత్రి నుంచి బాలుడి మృతదేహాన్ని తండ్రి బైక్పై తరలించిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి: తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి బాలుడి మృతదేహాన్ని తండ్రి బైక్పై తరలించిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన బాలుడు జేసవా మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బైక్పై తరలించాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. కొడుకు మృతదేహాన్ని 90 కిలోమీటర్లు బైక్పై తీసుకువెళ్లిన ఘటన రాష్ట్రంలో హెల్త్ కేర్ సెక్టార్లో దుస్థితిని అద్దం పడుతోందని అన్నారు. అలాగే బాలుడు మృతదేహాన్ని తండ్రి బైక్పై తరలిస్తున్న వీడియోను చంద్రబాబు ట్వీట్కు జత చేశారు.
Updated Date - 2022-04-26T19:38:57+05:30 IST