టీడీపీలో నేతల పనితీరుపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2022-04-21T19:45:10+05:30
పార్టీలో కొందరు నేతల పనితీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: పార్టీలో కొందరు నేతల పనితీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫీల్డులో పని చేయకుండా మాయ చేసే నేతలకు ఇకపై చెక్ పెట్టనున్నట్లు తెలిపారు. కొంత మంది నేతలు ఫీల్డులో పని చేయకుండా.. పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతా ఉంటారన్నారు. ఏదో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు కదా అని తాము కొన్నిసార్లు నమ్ముతామని తెలిపారు. ఇకపై అలాంటి నేతలకు కాలం చెల్లిందని చెప్పారు. ఎవరు పని చేశారు.. ఎవరు తప్పించుకుంటున్నారనేది మానిటర్ చేసే వ్యవస్థ వచ్చిందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Updated Date - 2022-04-21T19:45:10+05:30 IST