పోరస్ ఫ్యాక్టరీలో ప్రాణనష్టం విచారకరం: Chandrababu
ABN, First Publish Date - 2022-04-14T16:46:12+05:30
ఏలూరు జిల్లా అక్కిరెడ్డి గూడెం ఫ్యాక్టరీ ప్రమాద ఘటనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అమరావతి: ఏలూరు జిల్లా అక్కిరెడ్డి గూడెం ఫ్యాక్టరీ ప్రమాద ఘటనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటనలో ప్రాణనష్టం విచారకరమన్నారు. ఇప్పటికే 6 గురు చనిపోవడంతో పాటు 12 మంది తీవ్రంగా గాయపడడంపై ఆవేదన చెందారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడాలన్నారు. పరిశ్రమల్లో కార్మికుల రక్షణ విషయంలో యాజమాన్యాలు రాజీ పడకూడదని తెలిపారు. ప్రభుత్వం కూడా నిత్యం తనిఖీల ద్వారా ప్రమాదాల నివారణకు పని చెయ్యాలన్నారు. ప్రమాదానికి కారకులపై చర్యలు తీసుకోవాలని... బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Updated Date - 2022-04-14T16:46:12+05:30 IST