రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం: చంద్రబాబు
ABN, First Publish Date - 2022-01-01T22:14:00+05:30
రాష్ట్రంలో ఇప్పుడు ఆర్థిక విధ్వంసం జరుగుతోందని
అమరావతి: రాష్ట్రంలో ఇప్పుడు ఆర్థిక విధ్వంసం జరుగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మీడియాతో చంద్రబాబు చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నానన్నారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను సీఎం జగన్ దెబ్బ తీశారన్నారు. పారిశ్రామికవేత్తలు పొరుగు రాష్ట్రాలకు వలస పోతున్నారన్నారు. ఏసీబీ, సీఐడీలను కంట్రోల్లో పెట్టుకుని అందరిని బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
Updated Date - 2022-01-01T22:14:00+05:30 IST