ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu Serious: కృష్ణా జిల్లా టీడీపీ నేతలకు క్లాస్

ABN, First Publish Date - 2022-09-08T01:56:43+05:30

కృష్ణా జిల్లా టీడీపీ నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) క్లాస్ తీసుకున్నారు. కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ‌పై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కృష్ణా జిల్లా టీడీపీ నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) క్లాస్ తీసుకున్నారు. కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ‌ (Chennupati Gandhi)పై దాడి జరిగినా పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులు ఎందుకు స్పందిచలేదనని ఆయన ప్రశ్నించారు. సంఘటన జరిగితే అక్కడకు ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. ఇదేనా తమరు చేసేదని మండిపడ్డారు. ఇంత పెద్ద సంఘటన జరిగితే నేతల నుంచి ఎందుకు స్పందన లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకుల మధ్య సమన్వయం లోపించడంపై సీరియస్ అయ్యారు. భవిష్యత్తులో ఇలా ఉంటే ఊరుకోబోనని హెచ్చరించారు. 


కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం జరిగే సమావేశానికి అందరూ హాజరుకావాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కార్యకర్తలు, నేతలపై దాడులు జరిగితే కలిసికట్టుగా ఎదుర్కోవాలని..  ఈ నెల 12 లేదా 13 తేదీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా (Krishna District) పార్టీ సమావేశాల్లో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని  నియోజకవర్గాలకు నేతలంతా కలిసి వెళ్లాలని.. ఇక ముందు కృష్ణా జిల్లా వ్యవహారాలను స్వయంగా సమీక్షిస్తానని నేతలకు చంద్రబాబు చెప్పారు. 


Updated Date - 2022-09-08T01:56:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising