ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Konaseema: చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం

ABN, First Publish Date - 2022-07-22T00:06:19+05:30

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రమాదం తృటిలో తప్పింది. సోమపల్లి వద్ద చంద్రబాబు ప్రయాణిస్తున్న పంటుకు ప్రమాదం జరిగింది. అధిక బరువు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోనసీమ (Konaseema): సోoపల్లి వద్ద చంద్రబాబు (Chandrababu) ప్రయాణిస్తున్న పంటు ర్యాంపు తెగింది. చంద్రబాబు‌తో టీడీపీ నేతలు పంటు దిగేందుకు ఒక్కసారిగా పంటు చివర ర్యాంపు వద్దకు చేరుకున్నారు. చంద్రబాబును తొలుత భద్రత సిబ్బంది పంటు నుంచి నాటు పడవ ఎక్కించారు. వేరొక నాటు పడవ ఎక్కేందుకు ర్యాంపు మీదకి నేతలంతా రావటంతో ఒక్కసారిగా తెగి గోదావరి (Godavari)లో పడిపోయింది. బరువు కారణంగా పంటు ముందు భాగం రెక్క తెగింది. దీంతో ఒక్కసారిగా మాజీ మంత్రులు దేవినేని ఉమా (Devineni Uma), పితాని సత్యనారాయణ (Pithani Satyanarayana), ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు (manthena satyanarayana), ఎమ్మెల్యే రామరాజు (MLa Ramaraju), నేతలు కలవపూడి శివ, తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, చంద్రబాబు ఎన్‌ఎస్‌జీ సిబ్బంది, మీడియా ప్రతినిధులు నీటిలో పడిపోయారు. వెంటనే లైఫ్ జాకెట్లు వేసి వారిని సిబ్బంది కాపాడారు. అయితే ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఒడ్డుకు సమీపంలోనే ప్రమాదం జరగడంతో ప్రాణాపాయం తప్పింది. 









Updated Date - 2022-07-22T00:06:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising