జగన్కు నేను సమస్య కాకూడదు: స్పీకర్ తమ్మినేని
ABN, First Publish Date - 2022-04-12T21:24:07+05:30
జగన్కు నేను సమస్య కాకూడదు: స్పీకర్ తమ్మినేని
విజయవాడ: తానేప్పుడూ ఎటువంటి పదవులు ఆశించలేదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. జగన్కు తాను సమస్య కాకూడదు... ఆయన ఏ పని అప్పగించినా చేయటానికి తాను సిద్దంగా ఉన్నానని చెప్పారు. రేపు జనాల్లోకి వెళ్లి పార్టీ కోసం పని చేయమన్నా... వెళతానని స్పష్టం చేశారు. మంత్రి పదవులు రాని వాళ్లకు కొంత బాధ ఉంటుందన్నారు. జగన్మోహన్ రెడ్డి అందరికీ ఏదో విధంగా న్యాయం చేస్తారని చెప్పారు. అనేక సమీకరణాల నేపథ్యంలో ఆయన నిర్ణయాలు ఉంటాయన్నారు. స్పీకర్గా ఉండాలని తనకు చెప్పడానికి కూడా అప్పుడు ఇబ్బంది పడ్డారని గుర్తుచేశారు. తనకు ఎటువంటి ఇబ్బంది లేదు సర్... అని చెప్పి బాధ్యత తీసుకున్నానని అన్నారు. మంత్రి వర్గ కూర్పు చాలా బాగుందన్నారు. అన్ని వర్గాల దామాషా పద్ధతితో మంత్రి పదవులు కేటాయించారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అందరికీ సమామమైన న్యాయం చేశారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. 133కార్పొరేషన్లలో బిసి, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
Updated Date - 2022-04-12T21:24:07+05:30 IST