ఎక్కువ మాట్లాడితే పథకాలన్నీ ఆపేస్తాం
ABN, First Publish Date - 2022-07-01T09:14:26+05:30
ఎక్కువ మాట్లాడితే పథకాలన్నీ ఆపేస్తాం
సమస్యలు చెప్పిన మహిళలపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు విసుర్లు
విజయవాడ(పాయకాపురం), జూన్ 30: ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో సమస్యలు చెప్పిన వారి నోర్లు మూయించేందుకు వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు బెదిరింపులకు దిగుతున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని వాంబేకాలనీలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు గురువారం గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు. ఇళ్ల పథకం లబ్ధిదారులైన పలువురు మహిళలు ఇంటి నిర్మాణానికి ఒకేసారి రూ.35 వేలు కట్టలేమని, వెసులుబాటు కల్పించాలని ఆయనను కోరారు. దీంతో అసహనానికి లోనైన ఎమ్మెల్యే ‘ఏంటి లెక్చర్లు ఇస్తున్నావు. తమాషాగా ఉందా? ఎక్కువ మాట్లాడితే అన్ని పథకాలూ ఆపేస్తాం. ఇంటి పట్టా కూడా క్యాన్సిల్ అయిపోయిద్ది. జాగ్రత్త!’ అంటూ గద్దించారు.
Updated Date - 2022-07-01T09:14:26+05:30 IST