Janasena: నన్ను సస్పెండ్ చేసే ధైర్యం ఎవరికీ లేదు: బొలిశెట్టి శ్రీనివాస్
ABN, First Publish Date - 2022-07-27T17:59:12+05:30
నసేన పార్టీ నుంచి తనను సస్పెండ్ చేశారని నిన్న(మంగళవారం) నకిలీ లెటర్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని తాడేపల్లిగూడెం జనసేన నియోజకవర్గ ఇంచార్జి బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు.
పశ్చిమగోదావరి: జనసేన(Janasena) పార్టీ నుంచి తనను సస్పెండ్ చేశారని నిన్న(మంగళవారం) నకిలీ లెటర్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని తాడేపల్లిగూడెం జనసేన నియోజకవర్గ ఇంచార్జి బొలిశెట్టి శ్రీనివాస్ (Bolisetti srinivas) తెలిపారు. జనసేన బలోపేతం, ఎదుగుదల ఓర్వలేక కొంతమంది ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. జనసేనలో తాను భీష్ముడు లాంటి వాడినని చెప్పుకొచ్చారు. తనను సస్పెండ్ చేసే ధైర్యం ఎవరికి లేదన్నారు. దీనిపై సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేస్తానని... దీనికి తగిన సమాధానం తొందరలోనే చెపుతామని అన్నారు. ‘‘నేనేమి దొంగ టెండర్లు వేయడం లేదు. స్థలాలు కబ్జా చేయడం లేదు. మట్టి, ఇసుక అమ్ముకోవడంలేదు. నా సొంత డబ్బుని నేను పంచిపెట్టుకుంటున్నా’’ అని బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు.
Updated Date - 2022-07-27T17:59:12+05:30 IST