APలో కోవిడ్ నిధులు పక్కదారి పట్టించిన వ్యవహారంపై సుప్రీంలో విచారణ
ABN, First Publish Date - 2022-07-11T17:55:23+05:30
Andhrapradeshలో కోవిడ్ నిధులు పక్కదారి పట్టించిన వ్యవహారంపై Supreme Courtలో విచారణ జరిగింది.
New Delhi : Andhrapradeshలో కోవిడ్ నిధులు పక్కదారి పట్టించిన వ్యవహారంపై Supreme Courtలో విచారణ జరిగింది. పిడి ఖాతాలకు మళ్ళించిన నిధులను తిరిగి ఎస్డీఆర్ఎఫ్ ఖాతాకు బదిలీ చేయాలని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ నాగరత్న ధర్మాసనం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన సూచనలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు. సూచనలు తీసుకోవడం ఏమీ లేదు... తామే ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం వెల్లడించింది. కొంత సమయం ఇవ్వాలని ఏపీ న్యాయవాది తెలిపారు. బుధవారానికి ధర్మాసనం వాయిదా వేసింది.
Updated Date - 2022-07-11T17:55:23+05:30 IST