ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుషికొండ తవ్వకాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్

ABN, First Publish Date - 2022-05-23T19:18:19+05:30

రుషికొండ తవ్వకాలపై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విశాఖలో రుషికొండ తవ్వకాలపై ఎన్జీటీ ధర్మాసనం స్టే విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: రుషికొండ తవ్వకాలపై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విశాఖలో రుషికొండ తవ్వకాలపై ఎన్జీటీ ధర్మాసనం స్టే విధించింది. ఎన్జీటీ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. పర్యావరణ అనుమతులన్నీ పొందిన తర్వాతే.. రుషికొండ తవ్వకాలను చేపట్టినట్లు ఏపీ సర్కార్ పేర్కొంది. పర్యావరణానికి ఎటువంటి హానీ కలగకుండా.. తవ్వకాలు, నిర్మాణాలు చేపడతామని పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఎంపీ రఘురామ గతేడాది దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 6న ఎన్జీటీ విచారణ జరిపింది. తవ్వకాలపై అధ్యయనం చేసేందుకు సంయుక్త కమిటీని నియమించింది. నెల రోజుల్లో నివేదిక అందించాలని కమిటీకి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వుల వరకు ఎలాంటి తవ్వకాలూ జరపరాదని ఎన్జీటీ ఆదేశించింది. త్వరలో రుషికొండ తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

Updated Date - 2022-05-23T19:18:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising