ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్త పట్టించుకోవడం లేదని ఇద్దరు కుమారులతో సహా ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-06-24T07:48:49+05:30

భర్త పట్టించుకోవడం లేదని ఇద్దరు కుమారులతో సహా ఆత్మహత్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి) : భర్త తనను, కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని ఓ మహిళ కుమారులకు పురుగుల మందు తాగించి, తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన విజయవాడ కృష్ణలంక పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని బాలాజీనగర్‌లో జరిగింది. మధురానగర్‌కు చెందిన చందనలక్ష్మి(27)కి బాలాజీనగర్‌కు చెందిన చలమలశెట్టి గోపాలకృష్ణతో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు నాగమణికంఠ(9), జయహర ్ష(7) ఉన్నారు. గోపాలకృష్ణ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా భర్త తనను, కుటుంబాన్ని పట్టించుకోవడం లేదన్న భావన ఆమెలో ఉంది. బుధవారం విధులకు వెళ్లిన భర్త గోపాలకృష్ణకు వాట్సాప్‌ ద్వారా ఫోన్‌ చేసి భోజనం చేశావా అని అడిగింది. భోజనం చేశానని చెప్పిన గోపాలకృష్ణ లారీలో లోడ్‌తో మరో ఊరు వెళ్తున్నానని తెలిపాడు. వెళ్లేటప్పుడు రాత్రికి ఇంటికి వస్తానని చెప్పారు. గుంటూరు వైపు వెళ్లే జాతీయ రహదారికి పక్క న లారీని ఆపి ఇంటికి వెళ్లాడు. ఎంతకొట్టినా తలుపులు తీయకపోవడంతో పగలగొట్టి చూడగా చందనలక్ష్మితోపాటు నాగమణికంఠ, జయహర్ష విగజీవులుగా పడి ఉన్నారు. దీనిపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-06-24T07:48:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising