AP News: గుడివాడలో పోలీసుల ఆకస్మిక ఆంక్షలు
ABN, First Publish Date - 2022-09-24T16:55:18+05:30
అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ఈరోజు సాయంత్రానికి గుడివాడకు చేరుకోనుంది.
కృష్ణా జిల్లా: అమరావతి రైతులు (Amaravati farmers) చేపట్టిన మహాపాదయాత్ర (Mahapadayatra) ఈరోజు సాయంత్రానికి గుడివాడకు చేరుకోనుంది. పాదయాత్ర నేపథ్యంలో గుడివాడలో పోలీసులు ఆకస్మిక ఆంక్షలు విధించారు. గుడివాడలో 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు మీడియా వాట్సప్ గ్రూప్ ద్వారా పోలీసుల ప్రకటించారు. పాదయాత్రకు సంబంధం లేని వ్యక్తులు గుడివాడ వైపు రావద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు నిబంధలను ఉల్లంఘించి, సంఘీభావం పేరుతో పాదయాత్రలో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుడివాడకు భారీగా పోలీసులు చేరుకుంటున్నారు. గుడివాడలో పోలీసు వర్గాలు హై టెన్షన్ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.
Updated Date - 2022-09-24T16:55:18+05:30 IST