ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్మాణంలోని కష్టాన్ని ఇప్పటికైనా తెలుసుకోండి: చంద్రబాబు

ABN, First Publish Date - 2022-06-26T08:09:05+05:30

నిర్మాణంలోని కష్టాన్ని ఇప్పటికైనా తెలుసుకోండి: చంద్రబాబు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తన సైకో పాలన ఎలా ఉండబోతోందో సీఎం జగన్‌రెడ్డి ప్రజా వేదిక కూల్చివేతతో ప్రజలకు చూపించారని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజా వేదిక కూల్చివేతకు మూడేళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ుూకూల్చడం తప్ప కట్టడం జగన్‌కు చేతకాదు. చేసినవన్నీ కూల్చివేతలే. రాష్ట్ర అభివృద్ధిని కూల్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూల్చారు. ప్రజల జీవితాలను కూల్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను, ప్రజల హక్కులను, దళితుల గూడును, యువత భవితనూ కూల్చారు. ప్రజా రాజధాని అమరావతిని, పోలవరం కలను కూల్చి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. ప్రజా వేదిక కూల్చివేతతో జగన్‌కు వికృతానందం మిగలడం తప్ప ప్రజలకు ఒరిగింది శూన్యం. గత ప్రభుత్వం కట్టిన నిర్మాణాల్లో కూర్చుని పనిచేయడం తప్ప కొత్తగా కట్టిందేమీ లేదు. తన వల్ల  ఏమీ కాదని... తనకు ఏమీ రాదని ఆయనకు ఆయనే నిరూపించుకొన్నారు. కూల్చడం కంటే నిర్మించడం ఎంత కష్టమైన పనో మూడేళ్ల పాలన తర్వాత అయినా జగన్‌ తెలుసుకోవాలి్‌్‌ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-06-26T08:09:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising